తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐవైఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక.అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా సాయి, ఫహీమ్.వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉపేందర్, సంయుక్త కార్యదర్శిగా సతీష్ ఎన్నిక.మహాసభ తీర్మానాలపై దశలవారీ ఉద్యమాలు చేపడతాం : ఫహీమ్. ఇటీవల సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో జరిగిన అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నిర్మాణ మహాసభలో నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల తొలి సమావేశం శనివారం శేషగిరిభవన్'లో జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు నూతన ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ప్రధాన కారకార్యదర్శిగా ఎస్ కె ఫహీమ్ దాదా (కొత్తగూడెం), అధ్యక్షులుగా అనుముల సాయి (ములకలపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్ గా జర్పుల ఉపేందర్ (లక్ష్మీదేవిపల్లి), సంయుక్త కార్యదర్శిగా సాధనపల్లి సతీష్ (భద్రాచలం), సహాయ కార్యదర్శులుగా ఎస్ కె ఖయూమ్, బరిగేల భూపేష్, ఎస్ కె చాంద్ పాషా, ఎండి నదీమ్, సొల్లు రవికిరణ్, ఎస్ డి జాకీర్, భూక్యా రాజేష్, యాండ్ర మహేష్, చంద్రగిరి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనావత్ ఎం నవీన్, నామా వినోద్, ఎస్ డి అమీర్, కొచ్చర్ల రాకేష్, సలిగంటి నవీన్, దారావత్ శ్రీను, యు నాగరాజు, పరిపర్తి రాజు, యెల్లబోయిన నవీన్, సోషల్ మీడియా బాధ్యులుగా అజయ్ తోపాటు 73మందితో యువజన సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మహాసభలో ఆమోదించిన తీర్మానాలపై జిల్లా వ్యాపితంగా దశలవారీ ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ప్రధానంగా బిజెపి ప్రభుత్వం ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ వృత్తి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగ ఖాళీలు వంటి వాటిపై ఉద్యమాలు చేపడతామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ