Wednesday, 16 September 2026 06:52:42 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

12వ వేజ్ బోర్డు ఏర్పాటుపై కేంద్రం మొండి వైఖరి.. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కార్మిక గర్జన

Date : 07 August 2026 04:38 PM Views : 399

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేతన హక్కుల కోసం ఐదు జాతీయ కార్మిక సంఘాల ఐక్య పోరాటం.. తక్షణమే వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు పరిశ్రమల ముఖ్య కార్యాలయాల ఎదుట ధర్నా లో బాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ముందు ఉదయం 9 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. జేబీసీసీఐ (JBCCI) సంఘాల పిలుపు మేరకు చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమంపై శుక్రవారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయం శేషగిరిభవన్‌లో జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు త్యాగరాజు, సీఐటీయూ నాయకులు నర్సింహారావు, హెచ్‌ఎంఎస్ నాయకులు కృష్ణప్రసాద్, టీబీజీకేఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే ధర్నాలో బీఎంఎస్ మినహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒకే వేదికపై ఐక్యంగా పాల్గొంటున్నాయని తెలిపారు.వేజ్ బోర్డు ఏర్పాటును ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలు నాలుగు లేబర్ కోడ్లను సాకుగా చూపిస్తూ 12వ వేజ్ బోర్డు ఏర్పాటును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. అలాగే “ఒక సంస్థ–ఒక యూనియన్” విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కార్మికుల సంఘటిత హక్కులను బలహీనపరిచే చర్య అని విమర్శించారు.10వ వేజ్ బోర్డులో 20 శాతం, 11వ వేజ్ బోర్డులో 19 శాతం వేతన పెంపును సాధించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో 12వ వేజ్ బోర్డులో కనీసం 30 శాతం వేతన పెంపు సాధించడమే లక్ష్యంగా అన్ని కార్మిక సంఘాలు సమన్వయంతో పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఆరు నెలల ముందే కమిటీ.. ఇప్పుడు ఎందుకు జాప్యం?11వ వేజ్ బోర్డు అమలుకు ఆరు నెలల ముందుగానే కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని నాయకులు గుర్తుచేశారు.అయితే జూలై 1 నుంచి ప్రారంభం కావాల్సిన 12వ వేజ్ బోర్డు కోసం ఇప్పటివరకు కమిటీని ఏర్పాటు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, 12వ వేజ్ బోర్డు కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు వంగ వెంకట్,వీరస్వామి,రమణమూర్తి, గట్టయ్య,సముద్రాల సుధాకర్,హుమాయూన్,సందబోయిన శ్రీనివాస్, భీమయ్య,నర్సింగరావు, ఐ ఎన్ టీ యు సి నాయకులు ఆల్బర్ట్, సి ఐ టి యు,మంద నర్సింహారావు, హెచ్ ఎం ఎస్ నాయకులు ఆంజనేయులు,ఆసిఫ్, టి బి జి కే ఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :