Thursday, 14 May 2026 01:03:26 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

చర్ల–దుమ్ముగూడెం మండలాల్లో ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య పర్యటన.

Date : 07 December 2025 06:45 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎన్నికల వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య , ఎక్స్‌పెండిచర్ నోడల్ ఆఫీసర్ ఏ.వీ. రెడ్డి ఆదివారం దుమ్ముగూడెం మరియు చర్ల మండలాల్లో పర్యటనలు నిర్వహించారు.ముందుగా అధికారులు దుమ్ముగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయాన్ని సందర్శించి, పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టర్లు, షాడో రిజిస్టర్, రసీదులు మరియు లావాదేవీల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. వ్యయ పరిమితుల అమలు, పత్రాల నిర్వహణలో ఖచ్చితత్వం, మరియు పారదర్శక విధానాలపై సంబంధిత సిబ్బందికి సూచనలు అందజేశారు.తరువాత అధికారులు చర్ల మండలంలో కూడా వ్యయ రికార్డులను పరిశీలించి, అనంతరం పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థులు ఎన్నికల వ్యయ నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రతి ఖర్చు లావాదేవీని తగిన ఆధారాలతో నమోదు చేయాలని, సమయానుసారంగా రిపోర్టులు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అత్యంత ముఖ్యమని, ఏవైనా లోపాలు ఉన్న పక్షంలో తక్షణమే సరిదిద్దాలని అధికారులు తెలిపారు.ఈ పర్యటనలో ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ టీములు, MPDO సిబ్బంది మరియు సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :