తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్ పరీక్షలు ఆదివారం అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్లో ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెషన్–I లో మొత్తం 100 మందికి పరీక్ష కేటాయించగా, 89 మంది హాజరై, 11 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే సెషన్–II లో కూడా మొత్తం 100 మందికి పరీక్ష కేటాయించగా, 88 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై, 12 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ చర్యలు తీసుకోవడం వల్ల టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ