Wednesday, 16 September 2026 12:35:05 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 27 May 2025 07:19 PM Views : 574

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : వర్షాకాలంతో వచ్చే సీజనల్ వ్యాధులను నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ అధికారులు జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్‌, డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలేరియా వ్యాధిని వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. అపరిశుభ్రత దృశ్య సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం లేకుండా, ప్రతి డ్రైన్ ను శుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ ను తొలగించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి శుభ్రం చేయడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. శుభ్రమైన ఆహారాన్ని తినాలని, ఆకు కూరలు, కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలని, ఉడికించిన ఆహారాన్ని తినాలని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫీవర్ సర్వే, చేయాలని వైద్య శిబిరాల నిర్వహణ చేయాలని ఆయన తెలిపారు. అన్ని ఆసుపత్రులలో వ్యాధి నిర్ధారణ కిట్లు మరియు మందులు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని పాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్వహించిన పరీక్షల వివరాలు రిజిస్టర్ లో నమోదు చెయ్యాలి.అశ్వస్తకు గురి అయిన విద్యార్థులకు తగిన వైద్యం అందించాలి. వసతి గృహలలో కిచెన్ షెడ్ లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణపై వాట్సాప్ సందేశాలు గ్రూపుల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు సూచించారు.ఎక్కడైతే నీరు నిల్వలు ఉంటాయో అక్కడ ఇంకుడు గుంతలు నిర్మాణాలు మరియు అజోళ్ల పెంపకం చేపట్టాలి. ఈ కార్యక్రమంలో టీడీ ట్రైబల్ వెలఫైర్ మణెమ్మ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్,డీసీ హెచ్ ఓ రవిబాబు,జిల్లా విద్య శాఖ అధికారి వెంకటేశ్వర చారి,జిల్లా మలేరియా అధికారి స్పందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, పాల్వంచ మునిసిపల్ కమిషనర్ సుజాత, మిషన్ భగీదరా ఈ ఈ లు తిరుమలేష్, నళిని, జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జయలక్ష్మి మరియు జిల్లా అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :