తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశంలో ప్రజా వెతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం : ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే,ఫహీమ్ దాదా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారానీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి యూవతకు పిలుపునిచారు అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ దాదా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్ని ఢిల్లీలో జరుగు ఆందోళనకు యూవత అధిక సంఖ్యలో పాల్గొనలని * నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి. * రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. * నిరుద్యోగ యువతకు తక్షణం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. * ప్రజా వ్యతిరేక విధానాలను విరమించి ప్రజా సంక్షేమ చర్యలు చేపట్టాలి లేనియెడల దేశ యూవత బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతారని ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని, ప్రజలు, రైతులు, యువత, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే, ఖయ్యుమ్, జావీద్, కొయ్యడ రవి, దాసరి శివ,యాకుబ్ పాషా,సెల్వర్స్ స్టార్, గోపి,తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ