తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి దిశాకమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా దిశాకమిటీ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానం వాటి ప్రగతి పై సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అభివృద్ధి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న కేంద్ర పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో రహదారులు తాగునీరు గృహనిర్మాణం విద్య వైద్య సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు పోడు భూముల సమస్యలు విద్యుత్ సమస్యల పరిష్కారం ఆరోగ్యం తదితర అంశాలను ప్రస్తావించారు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకం పారదర్శకంగా వేగంగా అమలు చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ