తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణి: కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రామిక రంగాన్ని దేశ,విదేశీ పెట్టుబడిదారులకు బలవంతంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురులేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శనివారం పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కార్మికులు అనేక త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి కార్పొరేట్ పెద్దల లాభాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసిందని,కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేసేలా,కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తుందని విమర్శించారు.బ్రిటిష్ పాలనలో అంబేద్కర్ 14 గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు కుదించారని అటువంటి చట్టాలను మార్చి కార్మికుల మీద ఎక్కువ పని గంటల ఒత్తిడి తీసుకొస్తుందని,కార్మికవర్గం పోరాడి సాధించిన లేబర్ చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ లను అమలు చేయడం సరైందికాదన్నారు.కార్మిక వర్గంపై మోడీ వివక్ష వీడాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు వీరునాయక్, అసెంబ్లీ అధ్యక్షులు నాగుల రవికుమార్, గజ్జల శంకర్,భూక్యా శంకర్, మూడు భద్రి తదితరులు.
Admin
తెలుగు వెలుగు టీవీ