తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో, జిల్లా కలెక్టరు జితేష్ వి పాటిల్, తెలంగాణ రాష్ట్రపద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) క్యాలెండరు 2025 ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావం తో పనిచేస్తూ సమాజ సేవలో పద్మశాలి ఉద్యోగులు ముందుండాలనిఉద్యోగులు ఒకరికొకరు సహకరించుకుని, నిరుపేదల అవసరాలకు సహాయంచేస్తూ వారికి అండగా ఉండేకార్యక్రమాలు చేస్తూ అందరిమన్నలను పొందాలని పిలుపునిచ్చారు.తోటి ఉద్యోగులకు, పేద విద్యార్ధులకు, పేద పద్మశాలీలకు కుటుంబాలకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలుచేస్తున్నాము అని, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది దీని ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు. ప్రతి సంవత్సరంఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు, ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన వారిని సత్కరించటంజరుగుతుంది, రాష్ట్ర కార్యాలయం మరియు అన్ని జిల్లా కార్యాలయాలలో మ్యారేజ్ బ్యూరో లునిర్వహిస్తున్నాము. పైన తెలిపిన సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఉద్యోగులు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాము అని, ఇట్టి రాష్ట్ర పద్మశాలి సంఘానికి స్వంత కార్యాలయ భవనం కూడా హైదరాబాద్ లో కల్గివున్నది తెలియజేస్తూ పైన తెలిపిన కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొందుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆనంతుల లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ గారికి క్లుప్తంగా తెలియచేసారు.ఉద్యోగులు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమం కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆనంతుల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నట్రాజ్, అసోసియేట్ అద్యక్షులు గొట్టిముక్కుల మహేందర్ ఆర్గనైజేషన్ కార్యదర్శి పసునూతి వెంకటేశ్వర్లు, ఉపాద్యక్షులు కొండ సర్వేశ్వర రావు, చిప్ప వెంకటరమణ,జాయింట్ సెక్రెటరీలు శ్రీమతి కొండి పద్మజ, పాసికంటి మాధవి (వరంగల్) లతో పాటు ప్రాథమిక సభ్యులు వేముల రాజేశ్వర్ మరియు ఇతర సంఘం సభ్యులు కుచన మనోహర్, వెంకట రత్నం,పిండిపోలు బుజ్జికన్నయ్య తదీతరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ