తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు కు ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. 3తరాల నుండి కాంగ్రెస్ పార్టీ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించిన నాగ సీతారాములు 1989లోనే ఎన్.ఎస్.యు.ఐ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాగ సీతారాములు యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఓబీసీ జిల్లా కన్వీనర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీపీసీసీ సభ్యులు, వంటి పదవులు నిర్వర్తించి నేడు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, యాదవ విద్యావంతుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ గోకుల కృష్ణ ట్రస్ట్ చైర్మన్, బీసీ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా సేవలందిస్తున్నారు. కోవిడ్ 19 సమయంలో లో తమ ఎన్ఎస్సార్ ట్రస్ట్ ద్వారా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఏన్నో సేవలను అందించి, పార్టీలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు, పార్టీ పిలుపు మేరకు రచ్చబండ, గడప గడప ప్రోగ్రామ్స్ ద్వారా పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్, బీజేపీ పాలనలో పార్టీ పిలుపు మేరకు పెట్రోల్, డిజిల్, నిత్యవసరాల వస్తువు ధరల పెరుగుదలపై ఎన్నో ధర్నాలు, నిరసనల చేసిన నాగ సీతారాములు రాహుల్ గాంధీతో పాటుగా భారత్ జోడో యాత్రలో భాగంగా మక్తల్ నుండి మహారాష్ట్ర శివాజీ టెంపుల్ వరకు 13 రోజులు 385 కిమీ, రెవంత్ రెడ్డి పాదయాత్ర, మల్లు భట్టి పాదయాత్రలో, సైకిల్ యాత్ర , ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రల్లో పాల్గొన్నారు. తన సామాజిక సేవల ద్వారా అందరివాడుగా ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నాడు. ఎల్లలు దాటిన ఆయన సేవలను గుర్తించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీపీసీ ఇండియా) సంస్థ నాగ సీతారాములు ను గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు చైర్మన్ చైతన్య జంగా ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్టీపీసీ ఇండియా సంస్థ చైర్మన్ చైతన్య జంగా తోపాటు సెక్రెటరీ వీఎస్ వర్మ, మీడియా చైర్మన్ కిరణ్ బేజాడీ, డైరెక్టర్ చంద్రశేఖర్, కంట్రీ క్లబ్ అధినేత రాజివ్ రెడ్డి, అనుప్రసాద్ ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కాగా, ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు ను పలువురు రాజకీయ నాయకులు, కొత్తగూడెం పట్టణ ప్రముఖులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ