తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీవీకే–5 గనిలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులపై జరిగిన సంభాషణను అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను తిప్పికొట్టిన కార్మికులు. ఏఐటీయూసీ పోరాటాలతోనే సర్ఫస్ టూ సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ కొత్తగూడెం ఏరియా ఖాళీల భర్తీకి ప్రారంభించిన సీనియారిటీ లిస్టును రద్దుచేయించిన ఘనత ఎఐటియుసిది మాత్రమే...వీరస్వామీ,జక్కుల గట్టయ్య. సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ల పోస్టుల అంశాన్ని ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో ఏఐటీయూసీ కుదుర్చుకున్న అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమేనని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య అన్నారు.పీవీకే–5లో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులపై జరిగిన సంభాషణకు, ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సింగరేణిలో అండర్గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్లను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా కన్వర్షన్ చేయించేందుకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడిందన్నారు.సర్ఫేస్ కన్వర్షన్లో సింగరేణి వ్యాప్తంగా సీనియారిటీ లిస్టును ప్రాతిపదికగా తీసుకోవాలన్న యాజమాన్య నిబంధనను వ్యతిరేకించి, పోరాటాల ద్వారా కొత్తగూడెం ఏరియాలో ఆ నిబంధనను రద్దు చేయించామని తెలిపారు.సర్ఫేస్ టు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ కోసం జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు, జీఎం పర్సనల్, డైరెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించామని పేర్కొన్నారు.అండర్గ్రౌండ్ కార్మికులకు కన్వర్షన్లో అన్యాయం జరగకూడదన్నదే ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్ అని తెలిపారు.మరోవైపు మణుగూరు సర్ఫేస్ కార్మికులను కొత్తగూడెంకు బదిలీ చేయిస్తామంటూ కొందరు ఐఎన్టీయూసీ నాయకులు డబ్బులు వసూలు చేసి సర్ఫస్ టూ సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ కొత్తగూడెం ఏరియా ఖాళీలను భర్తీచేయాలని సర్క్యులర్ తెప్పించింది మీరుకదా అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సత్తుపల్లి సర్ఫేస్ టు సర్ఫేస్ కన్వర్షన్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎన్టీయూసీ నాయకులు యాజమాన్యానికి వినతిపత్రం ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.కార్మిక ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ పోరాడి ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో పలు కీలక అగ్రిమెంట్లు సాధించిందన్నారు.వాటిని కార్మికులకు వివరిస్తూ పీవీకే–5లో గేట్ మీటింగ్లు నిర్వహిస్తుంటే కొందరు ఐ ఎన్ టీ యు సి కార్యకర్తలు గొడవలు సృష్టిస్తూ సమావేశాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.శాంతియుత సమావేశాలకు ఆటంకం కలిగించకుండా, దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, నాయకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ