తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నమన్య వరిష్కారానికి ఉద్యమిస్తాం - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ నిరుద్యోగ సమస్యను రూపుమాపడం చేతగాని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని, మోసపూరి.త వాగ్దానాల చేసి యువతరం ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్కే ఫహీమ్ దాదా అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అంకితక్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ప్రభుత్వాలకు అధికారాన్ని కట్టబెట్టిన యువత బ్రతుకులు నట్టేట పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా ఉన్నవారికే అడనవు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బదులుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. ఇలాంటి విధానాలు నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని, ప్రజా సేవల నాణ్యతను కూడా దెబ్బతీస్తున్నాయని ఫహీమ్ చెప్పారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోందని, ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉండటం, మౌళిక వసతుల కొరత, నిధుల లేని కారణంగా ప్రభుత్వ విద్య నానాటికీ బలహీన పడుతోందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణా చట్టాన్ని వకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని టిజి పిఎస్సి ద్వారా వార్షిక నియామక క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్కే ఖయ్యూమ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రసూల్, రౌతు నురేష్, దాసరి శివ, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ