Sunday, 02 August 2026 02:35:04 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.

Date : 06 June 2026 07:51 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించండి లేదంటే ఉద్యమం తప్పదు - సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం.ఆరు జిల్లాల నుంచి 151 మంది ప్రతినిధుల పాల్గొనింపు – కార్మిక సమస్యలు, సింగరేణి భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీలలో కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కొత్తగూడెం శాసనసభ్యులు,ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సమావేశాలకు సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల నుంచి సుమారు 151 మంది యూనియన్ ప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.సమావేశంలో సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, యాజమాన్యం మరియు ప్రభుత్వాల విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి పెంపు, సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎండీ స్థాయి నిర్మాణాత్మక సమావేశాలు గుర్తింపు సంఘం తో నిర్వహించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న 11వ క్యాడర్ స్కీమ్ అమలు, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాల నిర్వహణ, మారుపేర్ల సమస్య పరిష్కారం, పర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్ను భారం తొలగింపు, ప్రతి కార్మికునికి 200 గజాల ఇంటి స్థలం కేటాయింపు, రూ.30 లక్షల వడ్డీలేని గృహ రుణం మంజూరు వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి.అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిలను తక్షణమే వసూలు చేయాలని సమావేశం డిమాండ్ చేయనుంది.కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్ పోరాటాలు, ఉద్యమాల రూపకల్పనపై రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయని మిరియాల రంగయ్య తెలిపారు.కొమరయ్య విగ్రహావిష్కరణకు భారీగా తరలిరావాలి.ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పునఃప్రారంభించే మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, కార్మికులు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :