Sunday, 07 June 2026 07:36:19 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.

Date : 06 June 2026 07:51 PM Views : 20

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించండి లేదంటే ఉద్యమం తప్పదు - సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం.ఆరు జిల్లాల నుంచి 151 మంది ప్రతినిధుల పాల్గొనింపు – కార్మిక సమస్యలు, సింగరేణి భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీలలో కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కొత్తగూడెం శాసనసభ్యులు,ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సమావేశాలకు సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల నుంచి సుమారు 151 మంది యూనియన్ ప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.సమావేశంలో సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, యాజమాన్యం మరియు ప్రభుత్వాల విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి పెంపు, సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎండీ స్థాయి నిర్మాణాత్మక సమావేశాలు గుర్తింపు సంఘం తో నిర్వహించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న 11వ క్యాడర్ స్కీమ్ అమలు, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాల నిర్వహణ, మారుపేర్ల సమస్య పరిష్కారం, పర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్ను భారం తొలగింపు, ప్రతి కార్మికునికి 200 గజాల ఇంటి స్థలం కేటాయింపు, రూ.30 లక్షల వడ్డీలేని గృహ రుణం మంజూరు వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి.అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిలను తక్షణమే వసూలు చేయాలని సమావేశం డిమాండ్ చేయనుంది.కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్ పోరాటాలు, ఉద్యమాల రూపకల్పనపై రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయని మిరియాల రంగయ్య తెలిపారు.కొమరయ్య విగ్రహావిష్కరణకు భారీగా తరలిరావాలి.ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పునఃప్రారంభించే మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, కార్మికులు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :