Sunday, 02 August 2026 03:54:50 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 01 June 2026 04:02 PM Views : 46

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు . ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుండి 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేలా ఉండాలని, ప్రతి గ్రామం, విద్యాసంస్థలు , ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, నాటిన ప్రతి మొక్కను పెంచి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దినప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని అన్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 55 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం ఉందని, అన్ని శాఖల సమన్వయంతో గత రెండు సంవత్సరాలుగా ఒక్క ఎకరం పోడు భూమి కూడా నరికివేయకుండా సంరక్షించగలిగామని తెలిపారు. జిల్లాలో పామాయిల్, జామాయిల్, వెదురు తదితర పంటల సాగు విస్తరించడంతో జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని, రాష్ట్రంలో పచ్చదన పరిరక్షణలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ గోడపత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది విధుల నిర్వహణలో భద్రతకు ఉపయోగపడే సేఫ్టీ కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశంలో అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :