తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : హాస్పిటల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎఐటీయూసీ. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్లో సోమవారం ఎఐటీయూసీ పిట్ సమావేశం పిట్ కార్యదర్శి అనంతలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ముఖ్య అతిథిగా హాజరై.ఈ సందర్భంగా మాట్లాడుతూ, హాస్పిటల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సిఎంఓ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, ఆసుపత్రిలో మెరుగైన పనివాతావరణం కల్పించడమే ఎఐటియుసి లక్ష్యమని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రభావంతో సింగరేణిపై పడుతున్న ఆర్థిక భారం, సంస్థ ఎదుర్కొంటున్న నష్టాలపై ఆయన వివరించారు. సింగరేణి పరిరక్షణకు కార్మికులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు అదనపు వాష్రూమ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్పొరేట్ ఉపాధ్యక్షులు కిష్టాఫర్ ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ