Wednesday, 16 September 2026 06:06:06 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని కార్మికుల పిలుపు :కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం ఎఐటియుసి

Date : 06 November 2025 04:43 PM Views : 467

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమొరాండం అందచేసిన నాయకులు గురువారం ఉదయం కొత్తగూడెం ఏరియా లో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమొరాండం అందచేసిన ఎఐటియుసి నాయకులు,ఈ యొక్క సమావేశాల్లో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు మాట్లాడుతూ సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేక పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇంటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల మీద ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించి వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని, అలవెన్స్ల మీద విధిస్తున్న ఇన్కమ్ టాక్స్ను కోలిండియాలో మాదిరిగా యాజమాన్యమే భరించాలని కోరారు,అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా 150 మస్టర్ల సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని, మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం కల్పించాలని, వీకే కోల్ మైన్ లో పర్మినెంట్ ఉద్యోగాలతోనే నడిపించాలని,ఈ యొక్క డిమాండ్లను కనుక యాజమాన్యం త్వరగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని మరియు నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్, సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శిలు హుమాయూన్, మధుకృష్ణ, కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సురేందర్, సౌజన్య,సీనియర్ నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, బండి వెంకటరమణ,కర్రు రమేష్, మెంగన్ రవి,కోటి,మురళి,గుమ్మడి మురళి,మాచర్ల శ్రీనివాస్, ఓం ప్రకాశ్, సుబ్రమణ్యం, వినయ్, లిఖిత్, గావిని నాగరాజు,రాజేష్,సురేష్,సాగర్,కృష్ణ,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :