తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 9 నుండి జూన్ 14వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కొరకు ప్రత్యేక లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని సోమవారం దమ్మపేట కోర్ట్ లో న్యాయవాదులతో సమావేశం ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ లో బ్యాంకు వారు మరియు చిన్న చిన్న ఆర్థిక సంస్థలు, ప్రతివాదులు అందరు వారి సంబంధిత కోర్టులకు వెళ్లి రాజీ కొరకు ప్రయత్నం చేసి త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో దమ్మపేట మేజిస్ట్రేట్ భవాని, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్, న్యాయవాదులు, పోలీస్ వారు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ