తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి అధికారులతో కలిసి మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలిన నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల వేదికగా 'కొత్తగూడెం మెగా జాబ్ మేళా' ను తీర్చిదిద్దుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్ లో రేపు జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఆయన సింగరేణి డైరెక్టర్ పి అండ్ పి కె వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా మేనేజర్ షాలేం రాజు తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నియోజకవర్గ పరిధిలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు 65కు పైగా కంపెనీలు ఇంటర్వూలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. నిరుద్యోగులు 4,500 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సింగరేణి యాజమాన్యం సహకారంతో జాబ్ మేళాను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. రేపు కొత్తగూడెంలో భారీ స్థాయిలో జరుగుతున్న ఈ జాబ్ మేళా వల్ల మన ప్రాంత యువతకు మేలు జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా ఇంటర్యూలకు వచ్చే వారి కోసం 2 ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. సింగరేణి ఎస్ ఓ 2 జిఎం కోటిరెడ్డి, ఏజిఎం (సివిల్) రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) మోహన్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య, గుర్తింపు సంఘం నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, ఎండి యూసుఫ్, ధర్మరాజు, గుత్తుల శ్రీనివాస్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ