Thursday, 17 September 2026 07:38:58 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 December 2025 07:33 PM Views : 289

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.ప్రస్తుత యాసంగి కాలంలో జిల్లాలో మొక్కజొన్న మరియు వరి ప్రధాన పంటలుగా సాగు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొక్కజొన్న పంట 38,500 ఎకరాల్లో, వరి పంట 8,750 ఎకరాల్లో సాగు అయిందని వెల్లడించారు. వరి నాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ విస్తీర్ణం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలో యూరియా అవసరాన్ని అంచనా వేసి సరఫరా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాకు మొత్తం 28,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవగా, అందులో 8,750 మెట్రిక్ టన్నులు ఇప్పటికే సరఫరా అయ్యాయని తలిపారు. ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 1,35,800 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా 1,51,200 బస్తాల యూరియా త్వరలో జిల్లాకు చేరుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.కావున రైతులు ఎవరూ యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమున్న చోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా రైతులకు నిరంతరంగా యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.రైతులు అవసరానికి మించి యూరియా ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వలన ఇతర రైతుల్లో అనవసర ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని అన్నారుజిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ కష్టం చేశారు.యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :