Thursday, 17 September 2026 07:39:22 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 01 July 2026 06:41 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్నవారికి వరం.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం కృషి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.రూ.2.17కోట్ల విలువచేసే సంక్షేమ చెక్కులను లబ్దిదారులకు అందించిన ఎమ్మెల్యే . పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్బులో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలతో పాటు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ కింద 144 మంది లబ్ధిదారులకు రూ. 1,60,00,704 విలువగల చెక్కులను, అలాగే నియోజకవర్గ పరిధిలోని మరో 143 మంది లబ్ధిదారులకు రూ. 57,34,500 విలువచేసే సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడబిడ్డల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ఆడబిడ్డ పెళ్లి ఆగిపోకూడదనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా, అనారోగ్యం మరియు ఆపద కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని, ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరబాబు, సొసైటీ చర్మం హనుమంతరావు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసిల్దార్లు పుల్లయ్య, కృష్ణ ప్రసాద్, ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు వాసిరెడ్డి మురళీ, సర్పంచులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :