తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రగతి మైదాన్ పీఎం విశ్వకర్మ యోజన మొదటి సంవత్సరం దిగ్విజయంగా ముగించుకున్న సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మహారాష్ట్రలో వార్ధా లో జరిగిన కార్యక్రమంలో ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ వారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈరోజు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ యోజన సంవత్సరం పూర్తిచేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వార్ధా నుండి పీఎం విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ట్రైనింగ్ సెంటర్ లో వర్థ లైవ్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈరోజు పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకి SBI మేనేజర్ శ్రీకాంత్, పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ చేతుల మీదుగా చెక్కుల అందజేశారు.
పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ పి ఎం విశ్వకర్మ ఆధునిక ఉపకారణ లో నైపుణ్యం అభివృద్ధికి మార్గం తెలుస్తుంది. నైపుణ్యంతో దేశం యొక్క నవనిర్మాణ కల్పన నరేంద్ర మోడీ సంకల్పం అని తెలియజేశారు గత ప్రభుత్వాలు ఏనాడు దేశంలో కులవృత్తులను పట్టించుకున్నా పాపాన లేదు ఈనాడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలకు చేయూత ఇస్తూ దేశంలో పేదవాడు ఆర్థికంగా ఎదగడం కోసం ఈనాడు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుత ఇస్తుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు వెనకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ,ఎన్ ఎస్ డి ఇ విజయ్ కుమార్ ,లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్సిబా, దేవి యూనియన్ బ్యాంక్ , ఎస్బిఐ, ఐ బి ఓ బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ