తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోపాలపురం గ్రామం లో నివసిస్తున్న సర్ప సత్యనారాయణ సర్ప సరస్వతి అనే దంపతులు ఒక రైతు దగ్గర కౌలుకు తీసుకొని రెండు ఎకరాలలో పత్తి వేశారు నిన్నటి రాత్రి ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి వేళ ఫైరు పీకి అడివిలో చెట్లల్లో వాగులో పత్తి మోపులు కట్టి అడవిలో పడేయడం జరిగింది. సిపిఎం పార్టీ బృందం గోపాలపురం వెళ్లి ఆ కుటుంబాన్ని సందర్శించి పత్తి పైరుని పరిశీలన చేసి ఎకరానికి లక్ష రూపాయలు ఫారెస్ట్ అధికారులు కట్టించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టి పత్తి పీకిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పంట చేతికి వచ్చే టైములో ఫారెస్ట్ అధికారులు ఇంత దారుణానికి పాల్పడ్డారని కనీసానికి అయ్యో పాపం అని కనికరం లేదు అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్ప సరస్వతి చెవుల దిద్దులు ఉన్న బంగారం తాడు అన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి మరి పంట వేశామని పంట చేతికి వచ్చే టైంలో ఫారెస్ట్ వాళ్లు పత్తిని పీకారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ పంట ఈ సంవత్సరం తీసుకోండి తరువాత వచ్చే సంవత్సరం వేయొద్దని చెప్పాల్సిన అవసరం ఫారెస్ట్ అధికారుల పైన ఉంది కానీ పాల్వంచ రేంజర్ నరేష్ కేవలం కావాలని వాళ్ళ బీట్ ఆఫీసుల తో ఈ రకంగా పత్తి పీకిoచి ఆదివాసి గిరిజనల్ని నష్టపెట్టే విధంగా వ్యవహరించారు కాబట్టి వారు పైన కేసు పెట్టాలి నష్టపరిహారం కట్టించే విధంగా కలెక్టర్ స్పందించాలని సిపిఎం పార్టీ కోరుతుంది ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుంటక కృష్ణ, శాఖా కార్యదర్శి నిమ్మల అప్పారావు, మాజీ సర్పంచ్ సర్ప వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ