తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ లో రిపేర్ లో ఉన్న అంతిమ రథం (వైకుంఠ రథం) బాగు చేయించి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మేనేజర్ ప్రసాద్ కి వినతి పత్రాలు అందించారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ లోని మేనేజర్ వినతి పత్రాన్ని అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత వైకుంఠ రథం నిరుపేదలకు ఎంతో అనుకూలంగా ఉండేదని, గత మూడు నెలల నుండి అది లో ఉండటంవల్ల ఎవరైనా కాలం చేసిన సందర్భంలో కార్పొరేషన్ రథం లేక, ప్రైవేటు వైకుంఠ రధాన్ని ఆశ్రయించవలసి వస్తుందని అన్నారు. ఆర్థికంగా పేదవారికి భారం పడుతుందని ఈ సందర్భంగా మేనేజర్ కి వివరించారు. తక్షణమే వైకుంఠ రథాన్ని బాగు చేయించి ఉపయోగం లోకి తేవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందించిన వారిలో వనందాసు గడ్డ శాఖ వన్ కార్యదర్శి తోగరు నరేంద్ర కుమార్, నాయకులు బానోత్ ఓం నారాయణ, ఎస్.కె జావిద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ