Sunday, 02 August 2026 09:33:47 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత: 15.5 లక్షల మొక్కల లక్ష్యం దిశగా కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ కృషి

Date : 05 June 2026 05:50 PM Views : 207

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూర శ్రీధర్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఆర్డీవో డి. మధు, డీఎస్పీ ఆదినారాయణరావు, తహసీల్దార్ డి. పుల్లయ్యలకు మొక్కలను బహూకరించి, పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కొత్తగూడెం సెంట్రల్ పార్కు మరియు బూడిగడ్డలోని కాళికా మాత ఆలయ ఆవరణలో అతిథులు, సంస్థ ప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అభినందించిన అధికారులు ఈ సందర్భంగా *ఆర్డీవో డి. మధు* మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా 15 లక్షల 50 వేలకు పైగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని విజయవంతంగా సంరక్షిస్తున్న కూర శ్రీధర్ నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. *డీఎస్పీ ఆదినారాయణరావు మరియు ఎమ్మార్వో డి. పుల్లయ్య* మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న నేటి కాలంలో మొక్కలు నాటడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కూర శ్రీధర్ చేస్తున్న ఈ నిరంతర కృషి పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ నగేష్ సెంట్రల్ పార్క్ అర్బన్ కొత్తగూడెం ఎం జయ కాంతారావు మరియు పార్క్ సిబ్బంది మహంకాళి అమ్మవారి శివాలయ అర్చకులు సాయి అయ్యగారు శీను, సంస్థ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :