తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూర శ్రీధర్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఆర్డీవో డి. మధు, డీఎస్పీ ఆదినారాయణరావు, తహసీల్దార్ డి. పుల్లయ్యలకు మొక్కలను బహూకరించి, పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కొత్తగూడెం సెంట్రల్ పార్కు మరియు బూడిగడ్డలోని కాళికా మాత ఆలయ ఆవరణలో అతిథులు, సంస్థ ప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అభినందించిన అధికారులు ఈ సందర్భంగా *ఆర్డీవో డి. మధు* మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా 15 లక్షల 50 వేలకు పైగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని విజయవంతంగా సంరక్షిస్తున్న కూర శ్రీధర్ నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. *డీఎస్పీ ఆదినారాయణరావు మరియు ఎమ్మార్వో డి. పుల్లయ్య* మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న నేటి కాలంలో మొక్కలు నాటడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కూర శ్రీధర్ చేస్తున్న ఈ నిరంతర కృషి పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ నగేష్ సెంట్రల్ పార్క్ అర్బన్ కొత్తగూడెం ఎం జయ కాంతారావు మరియు పార్క్ సిబ్బంది మహంకాళి అమ్మవారి శివాలయ అర్చకులు సాయి అయ్యగారు శీను, సంస్థ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ