Wednesday, 04 March 2026 09:52:40 AM
# భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్. # రేపే చంద్రగ్రహణం. # నూతన కలెక్టర్ అంకిత్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె. # సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఇంటర్మీడియట్ పరిక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

కొత్తగూడెం ప్రగతి మైదానంలో 15 ఆగస్టు 79 వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 14 August 2025 08:40 PM Views : 502

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. కొత్తగూడెం ప్రగతి మైదానంలో రేపు జరగబోయే 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుండి కార్యక్రమం ముగిసే వరకు జరిగే అన్ని ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేదిక బ్యాక్‌డ్రాప్, పోలీసు సాయుధ దళాల మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం వంటి కార్యక్రమాల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, డి.ఆర్.డి.ఏ., డ్వామా, వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, తదితర శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు, అధికారులకు మరియు విఐపీలకు గ్యాలరీలు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి సదుపాయాలు పకడ్బందీగా ఉండాలని, వర్షం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :