Monday, 03 August 2026 07:01:51 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెం ప్రగతి మైదానంలో 15 ఆగస్టు 79 వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 14 August 2025 08:40 PM Views : 725

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. కొత్తగూడెం ప్రగతి మైదానంలో రేపు జరగబోయే 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుండి కార్యక్రమం ముగిసే వరకు జరిగే అన్ని ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేదిక బ్యాక్‌డ్రాప్, పోలీసు సాయుధ దళాల మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం వంటి కార్యక్రమాల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, డి.ఆర్.డి.ఏ., డ్వామా, వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, తదితర శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు, అధికారులకు మరియు విఐపీలకు గ్యాలరీలు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి సదుపాయాలు పకడ్బందీగా ఉండాలని, వర్షం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :