తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్ నందు బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ,వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొని, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, యదలపల్లి వీరభద్రం, మూడు చిట్టిబాబు, మాజీ వైస్ ఎంపీపీ సీతాకుమారి, మహిళా నాయకురాలు ధరావత్ దేవిక, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, బత్తుల అశోక్, రెడ్డిబోయిన రాము, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, పోతురాజు రామారావు, బుడిపూడి ప్రతాప్, తాళ్లూరి నవీన్, రాయపాటి వెంకటేశ్వర్లు, మార్కాపురి నరసింహారావు, చెంగల నరసింహారావు, ఇల్లంగి తిరుపతి, లకావత్ హేమ్ల, బోడా భోజ్య, మాచిన్ని శేషగిరిరావు, పోగుల నాగభూషణం, బోడా దేవా, బానోత్ బిక్కు, బానోత్ చందర్, కిన్నెర నరసింహారావు, హరిలాల్, మోహన్, హనుమంతరావు, కుంజా రవికుమార్, దొడ్డ చలపతి, ఈసం వెంకటేశ్వర్లు, బచ్చల వంశీ, ముకేష్, మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ