Sunday, 07 June 2026 08:47:32 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

విపత్తులపై అవగాహన–సన్నద్ధతతోనే ప్రాణ, ఆస్తి నష్టం నివారణ: కలెక్టర్ అంకిత్.

Date : 06 April 2026 06:50 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్తులపై సరైన అవగాహనతో పాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని ఆమె సూచించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్–2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలసి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ బిటన్ సింగ్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు.జిల్లా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరదలు వంటి విపత్తులకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక (డీడీఎంపీ) అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ & బీ, ఇరిగేషన్, వ్యవసాయం తదితర శాఖల సమన్వయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు, ఎన్‌డీఆర్ఎఫ్ పాత్రను ప్రజలకు చేరవేయేందుకు ఫామెక్స్ కార్యక్రమాలు కీలకమని అన్నారు . షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి 15 రోజులపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్), ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఎన్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫామెక్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెరుగుతుందని, విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ బిటన్ సింగ్ తెలిపారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రాథమిక చికిత్స, నేలకూలిన నిర్మాణాల్లో శోధన మరియు రక్షణ చర్యలు, రసాయన మరియు జీవ విపత్తులకు స్పందన, అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, భూకంపాలు వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశం లో జడ్ పి సి ఈ ఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరవు, వైద్య శాఖ అధికారి తుకారాం రాతోడ్, విధ్యుత్ శాఖ ఎస్ ఈ మహీందర్,ఎన్‌డీఆర్ఎఫ్ సభ్యులు గోవిందరావు, జగదీష్, రంజిత్, ఎస్ డి ఆర్ ఎఫ్ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :