తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలి విద్యుత్ సవరణ బిల్లును, న్యూక్లియర్ చట్టాన్ని ఉద్యమించాలి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగు నర్సింహా రావు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగు నర్సింహా రావు డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. విద్యుత్ సవరణ బిల్లును, న్యూక్లియర్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని కోరారు. 100 శాతం ఫారన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ చట్టాలను, వికసిత్ భారత్ శిక్షా అభియాన్ బిల్లును 2025ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. దేశంలో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్హెచ్ఎం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, తగిన వేతనాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ అనునిత్యం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, గొనె మని, విజయలక్ష్మి, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, జక్కుల రాములు, మల్లికార్జున్ రావు, నజీర్ అహ్మద్, నిర్మల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ