Saturday, 18 April 2026 06:27:25 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

ఎమ్మెల్యే చొరవతో అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులు

Date : 07 February 2026 10:36 AM Views : 219

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే చొరవతో అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులు - పట్టణంలో మంచినీటి పైప్ లైన్ పనులు - కొత్తగూడెంను కార్పొరేషన్ చేసిన ఘనత ఎమ్మెల్యే కూనంనేనిదే - 26వ డివిజన్లో సిపిఐ విస్తృత ప్రచారం - సిపిఐ అభ్యర్థులను గెలిపించండి - ఓట్లు మీరు వేయండి - అభివృద్ధి మాకు వదిలేయండి - సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కొత్తగూడెం-పాల్వంచ ఉమ్మడి పట్టణాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసేంతవరకు అవిశ్రాంత పోరాటం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. శనివారం ఉదయాన్నే పార్టీ శ్రేణులతో కలిసి 26 డివిజన్లో సీపీఐ అభ్యర్థి ఎర్రా లింగేష్ ను గెలిపించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సిపిఐ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని అండదండలతో కార్పొరేట్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కొత్తగూడెం పట్టణంలో భవిష్యత్తు మంచినీటి సమస్య రాకుండా అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులతో పైప్ లైన్ పనులు పట్టణంలో మొదలయ్యాయని గుర్తు చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, విద్యావంతుడిగా, బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఎర్రా లింగేష్ ను గెలిపించి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లింగేష్ చదువుకునే రోజుల్లో రాత్రి సమయంలో ఆటో నడుపుతూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లి ఎంబీఏ చదువుకున్నాడని గుర్తు చేశారు. అలాంటి అభ్యర్థులు ప్రజా జీవితంలోకి రావడం శుభపరిణామం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సారధ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి పరుగులు పెడుతుందని, కార్పొరేటర్లుగా సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడం మన అందరీ బాధ్యతని అన్నారు. 26వ డివిజన్ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యవంతంగా ఆలోచించి సిపిఐ అభ్యర్థి లింగేష్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :