తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే చొరవతో అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులు - పట్టణంలో మంచినీటి పైప్ లైన్ పనులు - కొత్తగూడెంను కార్పొరేషన్ చేసిన ఘనత ఎమ్మెల్యే కూనంనేనిదే - 26వ డివిజన్లో సిపిఐ విస్తృత ప్రచారం - సిపిఐ అభ్యర్థులను గెలిపించండి - ఓట్లు మీరు వేయండి - అభివృద్ధి మాకు వదిలేయండి - సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కొత్తగూడెం-పాల్వంచ ఉమ్మడి పట్టణాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసేంతవరకు అవిశ్రాంత పోరాటం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. శనివారం ఉదయాన్నే పార్టీ శ్రేణులతో కలిసి 26 డివిజన్లో సీపీఐ అభ్యర్థి ఎర్రా లింగేష్ ను గెలిపించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సిపిఐ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని అండదండలతో కార్పొరేట్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కొత్తగూడెం పట్టణంలో భవిష్యత్తు మంచినీటి సమస్య రాకుండా అమృత్ 2.0 స్కీం కింద 160 కోట్ల నిధులతో పైప్ లైన్ పనులు పట్టణంలో మొదలయ్యాయని గుర్తు చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, విద్యావంతుడిగా, బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఎర్రా లింగేష్ ను గెలిపించి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లింగేష్ చదువుకునే రోజుల్లో రాత్రి సమయంలో ఆటో నడుపుతూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లి ఎంబీఏ చదువుకున్నాడని గుర్తు చేశారు. అలాంటి అభ్యర్థులు ప్రజా జీవితంలోకి రావడం శుభపరిణామం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సారధ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి పరుగులు పెడుతుందని, కార్పొరేటర్లుగా సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవడం మన అందరీ బాధ్యతని అన్నారు. 26వ డివిజన్ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యవంతంగా ఆలోచించి సిపిఐ అభ్యర్థి లింగేష్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ