తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లోని షేక్ పేట్ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర సీనియర్స్ పురుషుల,మహిళల పోటీలలో భాగంగా ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సీనియర్స్ పురుషుల,మహిళల బాక్సింగ్ టీమ్ లను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్,న్యాయవాది యెర్రా కామేష్ తెలిపారు.ఆదివారం జిల్లా బాక్సింగ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కామేష్ మాట్లాడుతూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సీనియర్ పురుషులు 47కేజీల నుండి 90ప్లస్ కేజీల వరకు 10 విభాగాల్లో,మహిళల 45కేజీల నుండి 80ప్లస్ కేజీల వరకు 9విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.కావున అర్హత కలిగిన బాక్సర్లు ఈనెల 16వ తేదీన ఉదయం 8గంటల లోపు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో రెండు జిల్లాల బాక్సింగ్ క్రీడాకారులు వయస్సు నిర్ధారణ ధ్రువపత్రం తీసుకుని హాజరు కావాల్సిందిగా కోరారు.పూర్తి వివరాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ 9885442131,ఖమ్మం జిల్లా వివరాలకు మాలోత్ రాజా 9949083202 కు సంప్రదించాలని కోరారు.ఈకార్యక్రమంలో నాగుల రవికుమార్,గజ్జెల శంకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ