Monday, 03 August 2026 09:07:47 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

100 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ విగ్రహం మార్పిడి నిర్ణయం!

Date : 22 March 2026 01:46 PM Views : 769

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శతాబ్ద కాలానికి పైబడిన చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ సంస్థ కొత్తగూడెం 7 షాఫ్ట్‌లో బొగ్గు తవ్వకాల ప్రారంభ దశలోనే, అక్కడి ఎత్తుగడ్డపై ఉన్న భారీ రాతిపై చెక్కబడిన హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి ఈ విగ్రహం “అభయ ఆంజనేయ స్వామి”గా భక్తుల పూజలను అందుకుంటూ, వారికి ధైర్యం, భక్తి నింపుతోంది. కాలక్రమేణా ఓపెన్‌కాస్ట్ పనులు ప్రారంభమవడంతో, ఆ ప్రాంతంలోని జనవాసాలు తొలగించబడగా, భక్తుల రాకపోకలు తగ్గాయి. అయినప్పటికీ, ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా ఆ గుట్టను కూడా తొలగించాలని సింగరేణి యంత్రాంగం నిర్ణయించడంతో, భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయంలోని విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా, మరొక అనుకూల ప్రాంతానికి మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. భక్తుల్లో ఆందోళన శతాబ్ద కాల చరిత్ర కలిగిన ఈ హనుమాన్ విగ్రహం తరలింపు నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భక్తుల భావోద్వేగాలకు ఎంతో దగ్గరైన ఈ దేవాలయాన్ని యథాతథంగా పరిరక్షించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, విగ్రహాన్ని సురక్షితంగా తరలించి, సరైన ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తే, మార్పిడికి భక్తులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :