తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి జూలై 10 (తెలుగు వెలుగు) సోలార్ ప్లాంట్లు మొదటి, రెండవ దశ లో చేపట్టిన నిర్మాణాలను అక్టోబర్ లోపు పూర్తి చేయాలి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పనులను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆదేశం సోలార్ ప్లాంట్ల నిర్మాణాలపై జరిపిన సమీక్షలో సింగరేణి ఛైర్మన్సింగరేణి భవన్, జులై 10, 2025రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందంలో పేర్కొన్న కాల పరిమితికి లోబడి పూర్తి చేయాలని, నిర్మాణ పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ హెచ్చరించారు .హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులు మరియు సంబధిత కాంట్రాక్టర్లతో ప్రత్యేకించి సమీక్షించారు. మొదటి దశలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ పై ఆయన నిశితంగా సమీక్షించారు. ఈ నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకుండా, తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుల చెల్లింపుల విషయంలో సింగరేణి సంస్థ నుంచి ఎటువంటి జాప్యం లేనప్పటికీ నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా సరే ఇచ్చిన పనులను అక్టోబర్ నెల నాటికి వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశారు. నిర్మాణ ఏజెన్సీలకు ఇదే చివరి అవకాశంగా భావించాలని,నిర్మాణాలను అక్టోబర్ కల్లా పూర్తి చేయనట్లయితే సదరు ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని, పనుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన వారిని కంపెనీలో బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు. నిర్మాణ పనులను అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయడానికి సింగరేణి సోలార్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయించకపోతే సంబంధిత అధికారుల పనితీరును వారి సర్వీస్ రికార్డులతో నమోదు చేస్తామని హెచ్చరించారు.మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బి.ఇ.ఎస్.ఎస్) వ్యవస్థ పనులను కూడా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు కాగా కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ యోజన పథకం కింద సింగరేణిలో వివిధ భవనాలపై చేపట్టిన 32.75 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్ల నిర్మాణపు పనులన్నీ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, జనరల్ మేనేజర్ (సోలార్) బి.సీతారామం, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్) ఫ్రిజరాల్డ్, పీపీడీ(హెచ్వోడీ) విశ్వనాథరాజు, సంబంధిత ఏరియా ఇంజినీర్లు, సోలార్ ప్లాంట్ల ఇంజినీర్లు, వర్క్ షాప్ ఇంజినీర్లు మరియు వివిధ కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ