తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యం లో ఈ నెల 23 వ తేదీ అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్బముగా బద్రాద్రి కొత్తగుడెం జిల్లా లో జరుగు ఒలింపిక్ డే రన్ టి షర్టులను జిల్లా కలెక్టరు జితేశ్ వి పాటిల్ ఆవిష్కరించారు . ఈ సందర్బముగా అయన మాట్లడుతూ ఒలింపిక్ క్రీడలలో దేశం తరపున ఫల్గుని పతకం గెలుపొందడం క్రీడాకారుని అంతిమ లక్యం అని అటువంటి ఒలింపిక్ క్రీడల ప్రధాన్యతను ఒలింపిక్ డే రన్ నిర్వహణ ద్వరా జిల్లా లో బాలబాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలని నిర్వాహుకులను కొరారు . ఈ సందర్బముగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ సక్ .సాబీర్ పాషా మాట్లడుతూ ఈ రన్ 18 వ తేదీ పాల్వంచ ,స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ నుండి కొత్తగుడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు ఒలింపిక్ క్రీడాజ్యోతి ని వెలిగించి ఒలింపిక్ డే రన్ ప్రారంబిస్త్రాని 19 వతేది అస్వరావుపేట ,20 వతేది బద్రాచలం ,21 వ తేదీ మణుగురు ,22 వతేది ఇల్లేందు ,23 వ తేదీ కొత్తగుడెం లో ముగిస్తుందని తెలిపారు .జిల్లా క్రీడల అధికారి ఎం .పరమధామరెడ్డి మాట్లడుతూ ఈ ఒలింపిక్ రన్ నిర్వహణలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు .ఈ కార్యక్రములో జిల్లా ఒలింపిక్ డే రన్ వర్కింగ్ ప్రెశిడెంట్ వై .వెంకటేశ్వర్లు ,చైర్మన్ కె.మహిధర్ ,ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీదర్ ,జాయంట్ సెక్రటరి పి .నాగేందర్ ,జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెశిడెంట్ మంజులాల్ ,కార్యదర్శి నాగలక్ష్మి ,జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరి వాసిరెడ్డి నరేశ్, అంతర్జాతీయ క్రీడాకారిణి సిందు తపస్విని పాల్గున్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ