తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలి బాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కారించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ