Thursday, 17 September 2026 11:50:36 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సమ్మె నోటీసు దెబ్బకు దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం

Date : 29 August 2026 06:19 PM Views : 219

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ ఒత్తిడికి తలొగ్గి కార్మికుల కీలక డిమాండ్లకు ఏ ఎల్ సి సమక్షంలో అంగీకారం. పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ నుంచి..పలు ప్రధాన డిమాండ్లపై కీలక అగ్రిమెంట్లు–కార్మికుల హక్కుల సాధనలో మరో ముందడుగు. చరిత్ర తిరగరాసిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయంపై కార్మికుల్లో హర్షం..ఏఐటీయూసీ నాయకత్వానికి అభినందనల వెల్లువ. వీకే కోల్ మైన్ నందు గేట్ మీటింగ్ లో వివరాలు వెల్లడించిన ఏఐటీయూసీ నాయకులు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ చేపట్టిన పోరాటానికి మరో కీలక విజయం లభించిందని నాయకులు తెలిపారు.జూన్‌ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, నిరంతర ఒత్తిడి ఫలితంగా సింగరేణి యాజమాన్యం పలు డిమాండ్లపై అంగీకరించిందన్నారు .పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం, ప్రతి నెల మెడికల్‌ బోర్డు నిర్వహణ, 149 మంది మెడికల్‌ ఫిట్‌ డిపెండెంట్లకు ఆఫీస్‌ ఆర్డర్లు, సీనియర్‌ మైనింగ్‌ స్టాఫ్‌కు ప్రమోషన్లు వంటి అంశాలపై అంగీకారాలు సాధించామని తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో సింగరేణి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, సింగరేణి విద్యాసంస్థల్లో సి బి ఎస్ ఈ సిలబస్, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈ ఎస్ ఐ వైద్య సదుపాయం, సేఫ్టీ మెటీరియల్‌, సర్ఫేస్‌ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం తదితర అంశాలపై కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించాలని, సంస్థపై రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా వీకే కోల్ మైన్ వద్ద శనివారం ఉదయం బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి పాల్గొని ప్రసంగించారు..సాధించిన అగ్రిమెంట్లు కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ నిరంతర పోరాటానికి నిదర్శనమన్నారు.మిగిలిన సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఏఐటీయూసీ సాధించిన విజయాలపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కత్తెర్ల రాములు, వీకే కోల్ మైన్ పిట్ కార్యదర్శి ఏం ఆర్ కే ప్రసాద్,ఆఫీస్ బ్యారర్స్ హీరాలాల్,కుర్ర రమేష్,మెంగన్ రవి,ప్రభాకర్,కోటి,ఓదెలు,రాజారత్నం,లక్ష్మీనారాయణ, సోములు,తిరుమలరావు,రమేష్, ఏసుపదం, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :