తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - ఏజెన్సీలో గిరిజనులతో పాటు దళితులకు సమాన హక్కులు ఇవ్వాలి - ఎస్సీ సబ్ప్లాన్ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి - ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తాం - డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ - కలెక్టరేట్ ముట్టడి విజయవంతం దళితుల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత విధానాలను విరమించి, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తరతరాలుగా నివసిస్తున్న దళితులకు కూడా సమాన హక్కులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు. సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు మంజూరు చేసి భూ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ పథకాన్ని పునరుద్ధరించి నిధులను పూర్తిగా విడుదల చేయడంతో పాటు, దళిత యువ పారిశ్రామికవేత్తలకు మంజూరైన ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేసి, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళిత నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించాలని ఆయన కోరారు. దళితుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో భారీ ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని అన్నారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అంకితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు గనిగళ్ళ వీరాస్వామి విశంశెట్టి పూర్ణచంద్రరావు కంచర్ల జమలయ్య డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు దొంతమాల చెన్నయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ పేరాల శ్రీనివాసరావు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే రత్నకుమారి పోలమూరు ధనలక్ష్మి మద్దాల హరిత జంగం మోహన్ రావు మామిడాల ధనలక్ష్మి వరుసు రామకృష్ణ పొలామూరి శ్రీనివాస్ మండల రాజు, రవికిషోర్ మేదిని లక్ష్మీ దారా లక్ష్మి ఇమ్మానుయేల్ నాగమణి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ