Friday, 18 September 2026 07:13:09 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

మీసేవ కేంద్రాల్లో సదరం, ఎన్‌ఎఫ్‌బీఎస్‌, యూరియా బుకింగ్ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 09 July 2026 05:18 PM Views : 162

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాలోని మీసేవ వీఎల్‌ఈలకు సదరం (యూడీఐడీ), నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్‌బీఎస్‌), మీసేవ ద్వారా యూరియా బుకింగ్ సేవల అమలుపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సదరం, ఎన్‌ఎఫ్‌బీఎస్‌ సేవలకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల మేరకు నమోదు చేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సేవలు అందేలా చూడాలని సూచించారు. దరఖాస్తుల నమోదు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన యూరియా బుకింగ్ సేవపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రతి అర్హులైన రైతుకు ఈ సేవను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవా రుసుములు మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేయకుండా ప్రజలకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని వీఎల్‌ఈలకు సూచించారు. ఈ సందర్భంగా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు సదరం, ఎన్‌ఎఫ్‌బీఎస్‌, యూరియా బుకింగ్ సేవల అమలు విధానంపై సవివరంగా శిక్షణ ఇచ్చారు. యూరియా బుకింగ్ యాప్ అందుబాటులో లేని రైతులు కూడా మీసేవ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పీపీబీ (PPB) నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఆధారంగా మీసేవ కేంద్రంలో యూరియా బుకింగ్ నమోదు చేసుకోవచ్చని వివరించారు. రైతు యాక్టివ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ధ్రువీకరణ అనంతరం వెంటనే బుకింగ్ ఐడీ రూపొందుతుందని, ఆ బుకింగ్ ఐడీ 48 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుందని తెలిపారు. మీసేవ ద్వారా యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం రూ.10 సేవా రుసుము మాత్రమే నిర్ణయించినట్లు పేర్కొన్నారు. యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసిన బుకింగ్‌లనే అధికారికంగా పరిగణిస్తారని తెలిపారు. బుకింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నర్మదా , ఏపీఎం నాగేశ్వరరావు , టీజీటీఎస్ జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, టీఎస్‌ఆన్‌లైన్ జిల్లా మేనేజర్ రాకేష్, జిల్లాలోని మీసేవ కేంద్రాల వీఎల్‌ఈలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :