Sunday, 02 August 2026 02:27:13 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు.

Date : 13 July 2026 07:01 PM Views : 658

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదకద్రవ్యాల నిర్మూలనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల కఠిన చర్యలు.గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు.మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు, గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతువాగు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కేసు నమోదు చేశారు.గంజాయి వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి, భవిష్యత్తులో మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, "మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసులు రాజీ పడే ప్రసక్తే లేదని, యువత భవిష్యత్తును కాపాడడం కోసం ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి" అని హెచ్చరించారు.ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీల్లో చుంచుపల్లి సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :