Thursday, 02 July 2026 05:25:48 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తగూడెంలో ఫ్రెషర్స్ వేడుకలు ---ముఖ్య అతిథి గా హాజరైన ఫార్మసీ డీన్ ఆచార్య గాదె సమ్మయ్య కాకతీయ యూనివర్సిటీ.

Date : 11 January 2025 08:37 PM Views : 536

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ వేడుకలలో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆచార్య గాదే సమ్మయ్య మాట్లాడుతూ ఈ వేడుక ఫార్మసి వృత్తిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థిని విద్యార్థుల కోసం వారి నైతిక బాధ్యతలను గుర్తు చేస్తూ. సేవా మానవత్వంతో ముందుకు కొనసాగాడానికి ప్రేరణను ఇచ్చే ప్ర త్యేక కార్యక్రమం అని చెప్పారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలి అని అన్నారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు సైంటిఫిక్ మెథడాలజీని అలవర్చుకొని కొత్త ఔషధంలు కనుగొనే విధంగా తయారు కావాలని, ప్రపంచ దేశాలు ఆంటీ వైరల్, ఆంటీ బ్యాక్టీరియల్, మరియు ఆంటీ క్యాన్సర్, డయాబెటిక్, అల్జిమర్స్, డెమిన్షియ వంటి కొత్త మందుల తయారు కొరకు అన్వేషణలు ఉంది అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఫార్మసీ కోర్సు వృత్తి విద్యా కోర్సు 50 శాతం థియరీ 50% ప్రాక్టికల్ చదవాల్సి ఉంటుంది కనుక విద్యార్థులు శ్రద్ధతో ప్రాక్టికల్స్ చేస్తూ థియరీలో మంచి పట్టు సాధించి సైంటిఫిక్ విధానాన్ని అలవరచుకొని క్రొత్త మందులను కనుక్కోవడానికి విద్యార్థులు కృషి చెయ్యాలని సైంటిఫిక్ మెథడాలజీని పాటిస్తూ చదవాలని మానసిక ఒత్తిడికి గురి కావద్దని మరి ప్రతి విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్ టుడే బుక్ ను తప్పకుండా చదివి అందులో పొందుపరిచిన సమాచారాన్ని రోజు వారీగా ప్రజలకు సేవ రూపంలో అందించాలని, ఫార్మసీ విద్య ఆత్మస్థైర్యాన్ని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ను, జీవితం మీద నమ్మకాన్ని సమాజంలో నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని కనుక ప్రతి ఒక్కరూ చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు.

మనం మొదటిగా అందరం ఫార్మసిస్టులం కనుక ప్రతి ఫార్మసిస్టులకు మందుల మీద పూర్తిపట్టు ఉంటుందని, ఫార్మసిస్ట్ మందులకు జీవం పోస్తారు మందులు రోగులకు జీవం పోస్తాయి, ఫార్మసిస్టు మరియు రోగులకు పరోక్ష సంబంధం ఉంటుందని, ఫార్మసిస్ట్ రోగుల పట్ల ప్రథమ డాక్టర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కానీ మీరు ప్రజలకు మందుల వాడక విషయం లో ఫార్మసిస్టు మరియు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడవద్దు అని సూచించాలని, 90% భారతదేశ ప్రజలు ఫార్మసిస్టు సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు దీనికి ముఖ్య కారణం ఫార్మసిస్టు విధులు తెలియకపోవడం అని, ఈ విధులను తెలియజేయడమే మీ యొక్క ముఖ్య బాధ్యత అని కొనియాడారు. భారతదేశ ప్రజలకు ఫార్మసిస్టు సేవలు ముఖ్యమని, ఫార్మసిస్టు సర్వీసులు అవసరమని మరియు ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ఫర్మకోవిగిలన్స్, క్లినికల్ శాస్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్, రెగ్యులేటరీ అఫైర్స్ ,ఫార్మసిస్టు గా అనలిస్ట్ గా డ్రగ్ ఇంస్పెక్టర్ గా ఫార్మాఇండస్ట్రీ లలో ఉజ్యల భవిష్యత్తు ఉందని తెలిపారు. మరియు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తారని వారి సేవలు వెన్నుపూస వంటిదని తెలిపారు, మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సెల్ ఫోన్ అలవాటుకు స్వస్తి చెప్పి, పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా మోహన్ గారు మాట్లాడుతూ మెడికల్ రంగంలో పూర్తి నాలెడ్జిని అందిస్తామని, పూర్తిగా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు క్లినికల్ గా తయారు చేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి గారు మాట్లాడుతూమాట్లాడుతూ సమాజంలో ఫార్మసి విలువ మరియు బాధ్యతలను విద్యార్థులకు వివరించారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఈ కళాశాలలో ఫార్మసీ విద్యను అభ్యసించడం గొప్ప విషయం అన్నారు, ఈ సందర్భంగా డీన్ ఆచార్య సమ్మయ్య మరియు డాక్టర్ రాధా మోహన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిరంజీవి ఫార్మసీ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :