తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసెంబర్ 21 తెలుగు వెలుగు)సిపిఎం మూడవ జిల్లా మహాసభలో నూతన జిల్లా కార్యదర్శిగా మచ్చా వెంకటేశ్వర్లు ఎంపిక కావడం హర్షనీయమని ఆయనకు ప్రత్యేక అభినందనలు గాని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం పార్టీ ఆధ్వర్యంలో ఉదృత పోరాటాల నిర్వహించేందుకు నూతన కార్యవర్గం నూతన కమిటీ పూనుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరుగుతున్నాయని పాలకులు ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలను తుంగలో తొక్కుతూ ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా అంటే ఉద్యమాల చరిత గల గడ్డ అని వాటిని పునర్నిర్మితం చేసి పేద ప్రజల పక్షాన సిపిఎం గొంతుక కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ