Thursday, 02 July 2026 06:56:35 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

కొత్తగూడెంలో విస్తృతంగా పంద్రాగస్టు వేడుకలు పాల్గొన్న కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు...

Date : 15 August 2024 03:20 PM Views : 399

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం- ఆగస్టు 15. (తెలుగు వెలుగు) భారత స్వాతంత్ర పోరాటంలో వీరుల పోరాట సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కొత్తగూడెంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జెండావిష్కరణ వేడుకల్లో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగిందన్నారు. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, అయినా సరే వారు వెనక్కి తగ్గకుండా పరాయి పాలన నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారని మరెన్నో త్యాగాలు చేశారన్నారు. మన స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతోమంది ధైర్యవంతుల కారణంగానే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉన్నామని భగత్ సింగ్, రాణీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వీరులు తమ జీవితాలను మన దేశ స్వాతంత్ర్య కోసం అంకితం చేశారని వారి సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నామని, మన ఐక్యతే మనకు బలమని, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందామని, మహాత్మా గాంధీ మనకు అహింసా, సత్యానికి ఉన్న శక్తిని బోధించారు. కాబట్టి అహింసా, సత్యాన్ని వీడకుండా శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందనీ అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా,మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :