Wednesday, 16 September 2026 05:09:51 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 23 September 2025 06:21 PM Views : 332

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక, రవాణా మరియు పోలీస్ శాఖలతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పత్రిక కొనుగోలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం న్యాయమైన మద్దతు ధర పొందేలా ప్రతి అధికారి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1,72,937 ఎకరాలలో పత్తి పంట సాగు జరిగిందని, 26 లక్షల 56,14 0 క్వింటాళ్ల పత్తి దిగుబడి కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2025-26 గాను పత్తికి మద్దతు ధర 8110/- ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు చేపట్టడానికి గాను సీసీ ఐ క్రింద ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా, రైతు ఇచ్చిన పత్తి బరువును కచ్చితంగా నమోదు కావాలని, వ్యాప్తంగా ఉన్న వే బ్రిడ్జి లను తనిఖీ చేయాలని తూనికలు కొలతల శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా సకాలంలో జరగాలని ఇందుకోసం పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని సూచించారు, కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, వసతి, గోదాములు, తేమ పరీక్షించే యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తీసుకువచ్చి అమ్మే విధంగా ఎటువంటి మధ్యవర్తులు లేదా అక్రమంగా పత్తి కొనుగోలు చేసి వారి ప్రభావానికి లోను కాకూడదని కలెక్టర్ సూచించారు. పత్తి మిల్లుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తి దిగుబడి అనంతరం పత్తి కట్టేను బయో చార్ తయారీ ఉపయోగించే విధంగా రైతులలో అవగాహన తీసుకురావాలని మిల్లర్లకు కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, తూనికలు కొలతలు శాఖాధికారి మనోహర్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల అధికారులు మరియు మిల్లర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :