Thursday, 17 September 2026 07:38:07 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

యజమానులకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి - మునిగడప పద్మ

Date : 27 June 2026 05:48 PM Views : 249

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ పరిధిలోని రామవరం విజయవాడ హైవేపై 16వ డివిజన్ పరిధిలో చేపడుతున్న కాలువ నిర్మాణం షాప్ యజమానులకు నష్టం కలగకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ నగర కమిషనర్ కొడరు సుజాత కి విన్నవించారు. శనివారం నేషనల్ హైవే పై చినుకు పడితే ఆ ప్రాంతం చెరువు లాగా మారి పాదచారులకు, వెహికల్ పై వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రతి రోజు శానిటేషన్ సిబ్బంది ఆ నీటిని క్లియర్ చేసేందుకు గంటల కొద్ది సమయం రచించాల్సి వస్తుందని ఎమ్మెల్యే కూనం సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని నగర కమీషనర్ కి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దానిలో భాగంగా కమీషనర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి రోడ్డు మధ్య నుండి 50 మీటర్లు లో కాలువ నిర్మాణం చేపట్టాలని మార్కింగ్ ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్ మునిగడప పద్మ కమిషనర్ కి 47 మీటర్లలో కాలువ నిర్మాణం చేపట్టి షాపు యజమానులకు ఆర్థిక ఇబ్బంది కలగకుండా చూడాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ భవిష్యత్తులో నేషనల్ హైవే ఆరు లైన్ల రోడ్డు జరిగే క్రమంలో అప్పుడు నష్టపోవాల్సి వస్తది అని, ఇప్పుడు 50 మీటర్లు పెట్టుకుంటే అప్పుడు నేషనల్ హైవే వారు ఆలోచిస్తారని లేదంటే రెండుసార్లు నష్టపోవాల్సి వస్తుందని కమిషనర్ తెలిపారు.ఐన ఒకసారి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. వ్యాపారస్తులు కూడా మాకు నష్టం కలగకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని కమిషనర్ ను వేడుకున్నారు. అనంతరం గోధుమ వాగు పై గుంటలను పూడ్చాలని కార్పొరేటర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కమిషనర్ నాలుగైదు రోజుల్లో రోడ్డు రిపేర్ చేస్తామని తెలిపారని ఆమె అన్నారు. కమిషనర్ వెంట ఏ ఈ బి శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ గుంటి శ్రవణ్, మాజీ కౌన్సిలర్ మునిగడప వెంకటేశ్వర్లు ,జవాన్లు ప్రభుదాసు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :