Thursday, 17 September 2026 09:49:36 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో సమగ్ర ప్రగతి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా

Date : 07 September 2026 12:11 PM Views : 348

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థలాల సమగ్ర పరిశీలన వేగవంతం శుభపరిణామం పారిశ్రామిక, వాణిజ్య రంగాలు మరింత పురోగతి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా అడుగులు నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మల్టీ-డిసిప్లినరీ బృందం సోమవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది. ఏఏఐ బృందంతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రతిపాదిత భూములు, సరిహద్దులు, రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు, తొలుత పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించిందని అందులోభాగంగానే జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు దిశగా కేంద్ర సాంకేతిక బృందం రాక కీలకమైన అడుగని పేర్కొన్నారు. విమానాశ్రయ రాకతో మారుమూల ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ లభించడమే కాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు సమగ్ర భూ వివరాలు, నివేదికలను ఏఏఐ బృందానికి పూర్తిస్థాయిలో అందించాలని కోరారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాకారమయ్యేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక, పరిపాలనా అనుమతులను వేగవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, దుర్గయ్య, దాసరి శ్రీనివాస్, నాయకులు ఎండి యూసుఫ్, గడ్డం సతీష్కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :