తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 3 తెలుగు వెలుగు) జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ELTA మరియు SCRT ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య ,ఇంచార్జ్ శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఇంగ్లీషు ఒలంపియాడ్ టెస్ట్ లో మొదటి బహుమతి టీ తేజస్విని ద్వితీయ బహుమతి సిహెచ్ శశి ప్రియ మరియు ఆంగ్ల ఉపన్యాస పోటీలో మొదటి బహుమతి సిహెచ్ శశి ప్రియ,రెండవ బహుమతి బి. ప్రసన్న విజేతలుగా గెలుపొందడం జరిగింది.జడ్పిహెచ్ఎస్ పాపకొల్లు విద్యార్థినిలు గెలుపొందటం విశేషం. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రవికుమార్, కోకన్వీనర్ ఎన్ గురుమూర్తి. అబ్జర్వర్ సల్మాన్ రాజ్ పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ