తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రూ.59లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం రూ. 59 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఎస్సిబి నగర్ 14వ డివిజన్, పాత కొత్తగూడెం 12వ డివిజన్లో, 10వ డివిజన్ బూడిదగడ్డలో, 58వ డివిజన్ హనుమాన్ బస్తీలో, 49వ డివిజన్ హనుమాన్ బస్తీలో చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం 24వ డివిజన్ బర్మా క్యాంపు ఏరియాలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న కార్మిక సంక్షమ భవన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి పారుదల, సీసీ రోడ్ల సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ భవనాల నిర్మాణంతో ప్రజల రవాణా సౌకర్యాలు, వసతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ అధికారులు పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా, పారదర్శకతతో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత వ్యవధిలోనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. స్థానిక డివిజన్ల ప్రజలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ తగిన సూచనలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు కూరపాటి సుధాకర్, పొలమూరి ధనలక్ష్మి, బోయిన విజయ్ కుమార్, సుప్రియ, నాయకులు ఎస్ కె ఫహీమ్, భూక్యా శ్రీనివాస్, యూసుఫ్, గోపికృష్ణ, గుత్తుల శ్రీను, ఖయూమ్, మండల రాజు, రాజేందర్, వాడే రాములు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ