Saturday, 01 August 2026 11:50:18 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 31 July 2026 05:55 PM Views : 235

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి. ప్రణాళికాబద్ధంగా హైలెవెల్ వంతెనల నిర్మాణం పూర్తిచేస్తాం.ప్రజల అవసరాలు, సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర వికాసానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని హేమచంద్రపురం - అనిశెట్టిపల్లి గ్రామాల మధ్య గల ముర్రేడు వాగుపై రూ.7.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రేగళ్ల ప్రాంతంలోని మున్యాతండా - పెద్దతండా గ్రామాల మధ్య గంగమ్మగుడి వాగుపై రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే మరో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామాల మధ్య అనుసంధానాన్ని పెంచడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే మారుమూల గ్రామీణ, ఏజెన్సీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సమీకరణలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు సత్వర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎంపిడివో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఎంపిడివో సుస్మిత, తహశీల్దార్ శిరీష, అధికారులు రఘురామయ్యా, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, రత్నకుమారి, సర్పంచులు అంజలి, పూర్ణ, హతిరామ్, వీరబాబు, దేవరగట్ల రాంబాబు, సపావట్ రవి, జర్పుల ఉపేందర్, గోవిందు, వెంకటనర్సయ్య, సత్యనారాయణ, ఎల్లావుల ఉపేందర్, బైకాని కృష్ణ, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :