తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు శనివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వాహనదారులకు వినూత్నంగా అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం తిరిగి టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పాల్గొన్నారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిర్వహిస్తున్న Arrive-Alive ప్రోగ్రాంలో వాహనదారులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని త్రీ టౌన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు.రోడ్డు భద్రత నియమాలను పాటించడంలో ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు.హెల్మెట్,సీటు బెల్ట్ ధరించడం వలన ప్రాణాలను కోల్పోకుండా ప్రమాదాల నుండి బయటపడవచ్చని సూచించారు.ప్రజల భద్రత,శ్రేయస్సు కోసమే పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి బాధ్యతగల పౌరులుగా మెలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ఇం ద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ