Saturday, 18 April 2026 07:44:52 PM
# చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ.

Date : 18 April 2026 06:19 PM Views : 44

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు శనివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వాహనదారులకు వినూత్నంగా అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం తిరిగి టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పాల్గొన్నారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిర్వహిస్తున్న Arrive-Alive ప్రోగ్రాంలో వాహనదారులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని త్రీ టౌన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు.రోడ్డు భద్రత నియమాలను పాటించడంలో ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు.హెల్మెట్,సీటు బెల్ట్ ధరించడం వలన ప్రాణాలను కోల్పోకుండా ప్రమాదాల నుండి బయటపడవచ్చని సూచించారు.ప్రజల భద్రత,శ్రేయస్సు కోసమే పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి బాధ్యతగల పౌరులుగా మెలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ఇం ద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :