Sunday, 07 June 2026 08:47:31 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ.

Date : 18 April 2026 06:19 PM Views : 178

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు శనివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వాహనదారులకు వినూత్నంగా అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం తిరిగి టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పాల్గొన్నారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిర్వహిస్తున్న Arrive-Alive ప్రోగ్రాంలో వాహనదారులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని త్రీ టౌన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు.రోడ్డు భద్రత నియమాలను పాటించడంలో ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని కోరారు.హెల్మెట్,సీటు బెల్ట్ ధరించడం వలన ప్రాణాలను కోల్పోకుండా ప్రమాదాల నుండి బయటపడవచ్చని సూచించారు.ప్రజల భద్రత,శ్రేయస్సు కోసమే పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి బాధ్యతగల పౌరులుగా మెలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ఇం ద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :