Sunday, 02 August 2026 06:42:19 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

Date : 06 June 2026 07:10 PM Views : 83

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలను, 02 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎస్పి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, గంజాయి,మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా కోరారు.మహిళలు & పిల్లల భద్రత గురించి పలు సూచనలు చేశారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి వారి పరిష్కారాన్ని కృషి చేస్తానని, విపత్కర సమయాలలో ఆపదలో ఉన్నప్పుడు డేల్ 100నకు ఫోన్ చేసి పోలీసువారి సేవలు పొందాలని సూచనలు చేశారు. సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు.ఈ ఆపరేషన్ లో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ మరియు స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నీఫర్ డాగ్ పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :