తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలను, 02 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎస్పి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, గంజాయి,మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా కోరారు.మహిళలు & పిల్లల భద్రత గురించి పలు సూచనలు చేశారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి వారి పరిష్కారాన్ని కృషి చేస్తానని, విపత్కర సమయాలలో ఆపదలో ఉన్నప్పుడు డేల్ 100నకు ఫోన్ చేసి పోలీసువారి సేవలు పొందాలని సూచనలు చేశారు. సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు.ఈ ఆపరేషన్ లో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ మరియు స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నీఫర్ డాగ్ పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ