Saturday, 01 August 2026 11:51:13 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

Date : 31 July 2026 05:28 PM Views : 315

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ జాతీయ రహదారిపై అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కాలువ పనులను 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొబ్బరికాయ కొట్టి కాల్వపనులను ప్రారంభించారు. శుక్రవారం 16వ డివిజన్లోని జాతీయ రహదారిపై నూతన కాలువ పనులను ప్రారంభించిన మునిగడప పద్మ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా కాలువలో నీళ్ళు పోకుండా జాతీయ రహదారిపై బురద నీళ్లు ప్రవహిస్తున్న సమస్యకి స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చొరవతో నేడు కాలువ నిర్మాణం జరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే కాలువ నిర్మాణం పనులు జరగడానికి సహకరించిన కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డి ఈ నవీన్ రెడ్డిలకు, వర్క్ ఇన్స్పెక్టర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న పాతకాలపై నిర్మాణాలు చేపట్టి కాలువలో నీళ్ళు పోకుండా చేయడం ద్వారా మురికినీరంత జాతీయ రహదారిపై ప్రవహించడంతో దుర్గంధం వెదజల్లుతూ, వాహనదారులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. కార్పొరేటర్ మునిగడప పద్మ కృషితో గత గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ సమస్యకు తెరపడుతున్నట్లు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సహచర15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరు సుప్రియ, నాయకులు సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెంకటేశ్వర్లు, రామవరం ప్రముఖులు ప్రమోద్ అగర్వాల్, రమణ, ఉమాకాంత్, జలీల్, వ్యాపారస్తులు, షాప్ ల యజమానులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :